
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటై చేస్తున్న సుపరిపాలనకు ఒక ఏడాది ఐన సందర్బంగా పండుగ వేడుకలు జరుపుకోమని ఇచ్చిన పిలుపు మేరకు స్థానిక 42వ డివిజన్ కామాక్షినగర్ లో ఎస్సి,బీసీ కాలనీలో జనసేన పార్టీ కార్పొరేట్ అభ్యర్థి శ్రీమతి త్యాడ కనకమహాలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ముగ్గులు పోటీలు నిర్వహించి, సాయంత్రం దీపాలు వెలిగించి మతాబులు వెలిగించి దీపావళి మాదిరిగా సంబరాలు నిర్వహించారు.
ఈసందర్భంగా జనసేన కార్పొరేట్ అభ్యర్థి, జనసేన వీరమహిళ త్యాడ కనకమహాలక్ష్మి మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పడి సుపరిపాలనకు ఒక వసంతం పూర్తి ఐన శుభతరుణంలో 42వ డివిజన్ కామాక్షినగర్ లో ముగ్గులు పోటీలు నిర్వహించి, కోలనీ లో ముగ్గులు వేసిన ప్రతీఒక్కరికి బహుమతులు ఇచ్చామని, మతాబులు కాల్చి దీపావళి మాదిరి సంబరాలు నిర్వహించామని తెలుపుతూ.. ప్రజలందరూ రాక్షస సైకో పాలన పోయి రామారాజ్యం వచ్చిందని సంతోషాలను వ్యక్తపరుస్తున్నారని తెలిపారు.
కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు లాలిశెట్టి రవితేజ, పిడుగు సతీష్,లోపింటి కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ నాయకులు చిట్టిరాజు, జనసేన యువనాయకులు రాజు, శేఖర్, శ్రీను, మురళి, భారీగా స్థానిక ప్రజలు భారీగా పాల్గున్నారు
~త్యాడ రామకృష్ణా రావు (బాలు)